గతంలో నిర్మల సీతారామన్ పెట్రోల్ డీజిల్ ధరలను రాష్ట్రాలు ఒప్పుకున్నట్లయితే తాము జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు అభ్యంతరం లేదని పేర్కొన్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం అతి త్వరలోనే డీజిల్, పెట్రోల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తెచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే కనుక జరిగినట్లయితే, పెట్రోల్ డీజిల్ ధరలపై కనీసం 30 రూపాయలు వరకు తగ్గే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి. ఈ లెక్కన చూసినట్లయితే, లీటర్ పెట్రోల్ ధర కేవలం 80 రూపాయలకే లభించే అవకాశం ఉంది. అదే సమయంలో డీజిల్ ధర 75 రూపాయలకే లీటర్లు లభించే అవకాశం ఉంది.