2022లో బంగారం ధర 10 గ్రాములకు రూ. 52,700, వెండి కిలో ధర రూ. 65,000 ఉండగా, 2023లో బంగారం రూ. 61,800, వెండి రూ. 76,500కి చేరింది. 2024లో బంగారం రూ. 74,900కి చేరింది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తాజా గణాంకాల ప్రకారం, 2025 జనవరి మార్చిలో దేశంలో బంగారం డిమాండ్ 118.1 టన్నులుగా నమోదైంది, ఇది గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 15% తగ్గింది. కానీ, బంగారం ధరలు 25% పెరిగిన కారణంగా మొత్తం డిమాండ్ విలువలో 22% వృద్ధి చోటు చేసుకుంది.