మొన్న ఒక్కరోజులోనే బంగారం ధరలు 5 వేల రూపాయలు పడిపోయాయి… అందరూ కొనాలని భావించేలోపే మళ్లీ మార్కెట్ ట్విస్ట్ ఇచ్చింది. ధరలు పెరిగిపోయాయి. మరో నెల రోజులు యుద్ధం జరిగే అవకాశముందని ట్రంప్ అంటున్నారు. సో నెలలో గోల్డ్ రేట్లు తగ్గినా ఆశ్చర్యపోవక్కర్లేదు, పెరిగినా తప్పదు.అయితే మార్కెట్లో ఇవాళ మళ్లీ బంగారం రేట్లు పెరిగాయి. 24 క్యారెట్లపై రూ.10 పెగ్గగా...రూ.1,50,940కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.10 పెరగ్గా.. ఇప్పుడు రూ.1,38,360 పలుకుతోంది. వెండి స్థిరంగానే ఉంది. మార్కెట్లు గమనించి కొనడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.