బంగారంతో పాటు వెండి ధరలు కూడా గణనీయంగా తగ్గాయి. కిలో వెండి ధర రూ.5,000 వరకు పడిపోయి ప్రస్తుతం రూ.2,70,000గా ఉంది.
గత ధరలతో పోలిస్తే జనవరి 29న 24 క్యారట్ బంగారం ధర రూ.1,78,850గా ఉండగా, ప్రస్తుతం అది రూ.1,53,550కి పడిపోయింది. అంటే రూ.25,300 వరకు తగ్గింది. అదే విధంగా 22 క్యారట్ బంగారం ధర అప్పట్లో రూ.1,63,950గా ఉండగా, ఇప్పుడు రూ.1,40,750గా ఉంది. అంటే రూ.23,200 తగ్గింది.