Gold Price Today: అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు..ఆ ప్రభావంతో మళ్లీ ఎగబాకిన పసిడి

Published : Jul 10, 2026, 10:25 AM IST

Gold Price Today: బంగారం కొనాలని ఎదురుచూస్తున్న వారికి మరోసారి నిరాశ ఎదురైంది. గత కొన్ని రోజులుగా ఒడిదుడుకులకు లోనవుతున్న పసిడి ధరలు ఇప్పుడు వరుసగా రెండో రోజు కూడా ఎగబాకాయి. 

PREV
13
అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు

అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు, అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ పెరుగుతున్న ఉద్రిక్తతలు, డాలర్ ఇండెక్స్‌లో మార్పులు, సేఫ్ హేవెన్ అసెట్‌గా బంగారంపై పెరుగుతున్న పెట్టుబడిదారుల ఆసక్తి వంటి అంశాలు ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. 

23
హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారంపై రూ.380 పెరిగి రూ.1,44,820కు చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.350 పెరిగి రూ.1,32,750 వద్ద కొనసాగుతోంది. 18 క్యారెట్ల రూ.290 పెరిగి ప్రస్తుతం రూ.1,08,620గా నమోదైంది. వెండి ధర మాత్రం రెండ్రోజులుగా స్థిరంగా కొనసాగింది.   కిలో వెండి ధర రూ.2,45,000 వద్దనే ట్రేడవుతోంది.

33
మార్కెట్లను గమనించాలి

ఇక రాబోయే రోజుల్లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై తీసుకునే నిర్ణయాలు, డాలర్ కదలికలు, అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, కేంద్ర బ్యాంకుల బంగారం కొనుగోళ్లు వంటి అంశాలను బట్టి పసిడి ధరల్లో మరోసారి హెచ్చుతగ్గులు నమోదయ్యే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అందువల్ల బంగారం కొనుగోలు చేయాలనుకునేవారు తాజా మార్కెట్ రేట్లను పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories