ఇవీ కారణాలు..
వచ్చే ఏడాదిలో బంగారం ధరలు పెరగడానికి పలు కారణాలు ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బంగారంపై మెరుగైన రాబడి వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయం నెలకొన్న భౌగోళిక రాజకీయ అనిశ్చిత పరిస్థితులు, కేంద్ర బ్యాంకులు పెద్ద మొత్తంలో బంగారం కొనుగోలు చేస్తుండడం, వడ్డీ రేట్లు తగ్గింపు వంటివి బంగారం ధరలు పెరగడానికి కారణమని అంటున్నారు. వెండి సైతం వచ్చే ఏడాదిలో కిలో రూ. 1.25 లక్షలకు చేరొచ్చని అంచనా వేస్తున్నారు. ఏఐ టెక్నాలజీలో వెండి ఉపయోగం పెరుగుతున్న నేపథ్యంలో కూడా వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.