Gold Prices: పసిడి ప్రియులకు భారీ షాక్..ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరలు

Published : Jun 09, 2026, 12:17 PM IST

Gold Prices: బంగారం కొనాలని ప్లాన్ చేసేవారికి బ్రేకింగ్ న్యూస్. మళ్లీ ధరలు పెరిగి ఒక్కసారిగా షాకిచ్చాయి. రేట్లు తగ్గాయని సంతోషించేలోపే ఊహించని పరిణామం ఎదురైంది. తులం బంగారం ఎంత పెరిగిందంటే.. 

PREV
13
కొనుగోలుదారులకు బిగ్ షాక్

పసిడి ధరలు మరోసారి ఎగబాకాయి. దీంతో కొనుగోలుదారులు, పసిడి ప్రియులు ఆందోళన చెందుతున్నారు. ధరలు తగ్గాయని కొనుగోళ్లకు ప్లాన్ చేసుకున్నవారికి ఇదొక్ షాకింగ్ అప్‍డేట్. కొన్నిరోజులుగా తగ్గుతూ వస్తూ ఇవాళ భారీ జంప్ చేశాయి. 

23
గణనీయంగా పెరిగిన బంగారం

హైదరాబాద్‌తో పాటు ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇవాళ గణనీయంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.1,470 పెరిగి రూ.1,53,160కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై ఒక్కరోజులోనే రూ.1,350 పెరిగి రూ.1,40,400 వద్ద ఆగింది. వెండి మాత్రం స్థిరంగా ఉంది. ప్రస్తుతం కిలో వెండి రూ.2.70 లక్షలకు చేరుకుంది. దీంతో వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి కొంత ఊరట లభించినట్టైంది.

33
అంతర్జాతీయ పరిణామాలు

అంతర్జాతీయ పరిణామాలు, డాలర్ కదలికలు, కేంద్ర బ్యాంకుల నిర్ణయాలు బంగారం ధరలపై కీలక ప్రభావం చూపే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరి రానున్న రోజుల్లో బంగారం ధరలు ఎలా మారతాయో చూడాలి. 

Read more Photos on
click me!

Recommended Stories