హైదరాబాద్తో పాటు ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇవాళ గణనీయంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.1,470 పెరిగి రూ.1,53,160కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై ఒక్కరోజులోనే రూ.1,350 పెరిగి రూ.1,40,400 వద్ద ఆగింది. వెండి మాత్రం స్థిరంగా ఉంది. ప్రస్తుతం కిలో వెండి రూ.2.70 లక్షలకు చేరుకుంది. దీంతో వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి కొంత ఊరట లభించినట్టైంది.