Published : Apr 09, 2026, 11:08 AM ISTUpdated : Apr 09, 2026, 11:10 AM IST
Today Gold Rate: మళ్లీ బంగారం రేట్లు యూటర్న్ తీసుకున్నాయి. ఒక్కసారిగా పాతాళానికి పడిపోయాయి. వెండి రేట్లు సైతం ఊగిసలాడుతున్నాయి. మూడు రోజుల తర్వాత నిన్న పెరిగిన ధరలు...ఇవాళ కుప్పకూలిపోయాయి. దీంతో ఇన్వెస్టర్లు డాలర్ వైపు మొగ్గు చూపుతున్నారు.
మగువులకు పండగే..పసిడి రేట్లు కుప్పకూలిపోయాయి. ట్రంప్ దెబ్బకు మార్కెట్లు కుదేలయ్యాయి. ఇన్వెస్టర్లకు చుక్కలు కనిపిస్తున్నాయి. పెట్టుబడి పెట్టేందుకు ఇన్వెస్టర్లు సిద్ధమయ్యేలోపే ట్రంప్ నిర్ణయానికి బంగారం పతనమైంది.
25
మాటమార్చి తూచ్ అనేసిన ట్రంప్
యుద్ధం ఆపేస్తున్నామని ప్రకటించిన ట్రంప్...మరోసారి మాటమార్చి తూచ్ అన్నారు. మళ్లీ దాడులు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. హార్మూజ్ జలసంధి గేట్లు తెరవకపోతే భీకర యుద్ధం మళ్లీ మొదలవుతుందని బెదిరించారు. యుద్ధం కోసం అమర్చుకున్న యుద్ధ సామగ్రిని అక్కడే ఉంది కాబట్టి....మీరు తోక జాడిస్తే మీపైన ప్రయోగించక తప్పదని వార్నింగ్ ఇస్తున్నారు. డీల్ కుదిరే వరకు అక్కడే ఉంటాయని ట్రంప్ చెప్తున్నారు.
35
ట్రంప్ వార్నింగ్
ఏదైనా రీజన్ వల్ల డీల్ కుదరకపోతే మాత్రం చరిత్రలో జరగనంతగా అతిపెద్ద యుద్ధం జరుగుతుందని ట్రంప్ వార్నింగ్ ఇస్తున్నారు. ఇప్పటికే ఇజ్రాయెల్, అమెరికా దాడులతో ఇరాన్ బలహీన పడిపోయింది. అయినప్పటికీ ఇరాన్ తలపడుతూనే ఉంది. ఇరాన్ చుట్టూ తమ నౌకలు, మిలిటరీ సిబ్బంది ఆయుధాలతో సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
మరోసారి పరిస్థితులు చేయిదాటడంతో బంగారం ధరలు క్షీణించాయి. అయితే ఇన్వెస్టర్లకు మాత్రం భారీ దెబ్బ పడింది. పసిడి ధరలు పెరుగుతుందని సంతోషించేలోపే ట్రంప్ మళ్లీ బాంబ్ పేల్చారు. సో ఈ రీజన్ వల్ల చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది.
55
రూ.1,51,480కు చేరిన మేలిమి బంగారం
ఇక హైదరాబాద్ లో బంగారం ధరలు చూసుకుంటే...24 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.2,340 తగ్గి రూ.1,51,480కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాములకు పసిడి ధర రూ.2,150 పతనమై..రూ.1,38,850 వద్దకు వచ్చింది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కేజీ సిల్వర్ ధర రూ.2,65,100 కు వద్దకు వచ్చింది. మళ్లీ పసిడి ధరల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి కాబట్టి ఆచితూచి నిర్ణయం తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.