రైల్వేలు ప్రతి తరగతి ప్రయాణీకులకు లగేజీ పరిమితిని నిర్ణయించాయి. వీటి ప్రకారం..
* ఫస్ట్ ఏసీ ప్రయాణీకులు: 70 కిలోల వరకు లగేజీ తీసుకెళ్లవచ్చు.
* ఏసీ 2-టైర్ ప్రయాణీకులు 50 కిలోల వరకు.
* ఏసీ 3-టైర్, స్లీపర్ క్లాస్ ప్రయాణీకులు 40 కిలోల వరకు.
* జనరల్ క్లాస్లో ప్రయాణీంచే వారు 35 కిలోల వరకు లగేజీని తీసుకెళ్లొచ్చు.
ఈ పరిమితిలోపే బంగారం లేదా ఇతర విలువైన వస్తువులు తీసుకెళ్లాలి. పరిమితిని మించితే అదనపు ఛార్జీలు లేదా జరిమానాలు విధించే అవకాశం ఉంటుంది.