భారతదేశంలో ఉచిత రైలు ఇదే..
ఇంత పెద్ద రైల్వే వ్యవస్థలో టిక్కెట్ లేకుండా రైలు ప్రయాణం చేసే ఛాన్స్ ఉందని చాలా మందికి తెలియదు. ఈ రైలుకు టికెట్ అవసరం లేదు. టీటీఈ టికెట్ చెక్ చేయడానికి వస్తే పట్టుబడతామనే భయం కూడా అవసరం లేదు. మీరు ఈ రైలులో ఏడాది పొడవునా ఉచితంగా ప్రయాణించవచ్చు.
భాక్రా-నంగల్ రైల్వే సర్వీస్
భారతదేశంలో ఇదే ఏకైక ఉచిత రైలు. ఈ రైలు పేరు 'బాగ్రా-నంగల్'. ఈ ట్రైన్ లో మీరు ఎటువంటి ఖర్చు లేకుండా ప్రయాణం చేయవచ్చు. ఈ రైలు పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ మధ్య నడుస్తుంది. ఇందులో రోజుకు 800 నుంచి 1000 మంది ప్రయాణిస్తారు.
ఈ రైలు కోచ్లు చెక్కతో తయారు చేశారు. ఇది డీజిల్ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఈ రైలులో మొత్తం మూడు కోచ్లు మాత్రమే ఉంటాయి. వీటిలో పర్యాటకుల కోసం, మహిళల కోసం ప్రత్యేకంగా కేటాయించిన భోగీలున్నాయి. ఈ రైలును నడపడానికి రోజూ 50 లీటర్ల డీజిల్ వినియోగిస్తారు. అందమైన కొండల మధ్య 13 కిలోమీటర్లు హాయిగా ప్రయాణం చేయొచ్చు. ఈ ట్రైన్ జర్నీ ప్రయాణికులకు అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది.