భారతదేశానికి చెందిన పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ప్రపంచ కుబేరుల టాప్ 10 లిస్టు నుంచి పడిపోయారు. అమెరికాకు చెందిన ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రపంచ కుబేరుల జాబితాను విడుదల చేసింది. ఎలాన్ మస్క్ రూ.29 లక్షల కోట్లతో మొదటి స్థానంలో ఉన్నాడు.