ఎవరీ శశాంక్ కుమార్, హర్షిల్ మాథూర్?
హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2025 ప్రకారం ఇద్దరు భారతీయ యువకులు సంపాదనలో చరిత్ర సృష్టించారు. ప్రస్తుతం ప్రపంచంలోనే ఆన్ లైన్ ఆర్థిక లావాదేవీల విషయంలో భారత్ టాప్ లో ఉంది... ఇది ముందే గుర్తించిన శశాంక్ కుమార్, హర్షిల్ మాథూర్ రేజర్ పే ను స్థాపించారు. ఈ ప్లాట్ ఫారమ్ ద్వారా ఆన్ లైన్ పేమెంట్స్ చాలా సులభంగా పూర్తిచేయవచ్చు. క్రెడిట్, డెబిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్, యూపిఐ లను ఉపయోగించి ఈ రేజర్ పే ద్వారా సురక్షితంగా ఆన్ లైన్ పేమెంట్స్ చేయవచ్చు.
అతి చిన్న వయసులోనే ఫిన్ టెక్ కంపనీని స్థాపించి ఈ రేజర్ పే ను అందుబాటులోకి తీసుకువచ్చారు శశాంక్ కుమార్, హర్షిల్ మాథుర్. 2014లో ప్రారంభమైన ఈ స్టార్టప్ అతి తక్కువ కాలంలోనే బాగా అభివృద్ధి చెందడంతో ఈ ఇద్దరు వేలకోట్లు సంపాదించారు. దీంతో దేశంలోనే యంగెస్ట్ బిలియనీర్స్ గా అవతరించారు. కేవలం 34 ఏళ్ళ వయసులోనే ఒక్కొక్కరి నికర ఆదాయం విలువ రూ.8,643 గా ఉంది.
తాజాగా హురుర్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2025 లో రేజర్ పే వ్యవస్థాపకులు శశాంక్, హర్షిల్ కు చోటుదక్కింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 3,442 మంది బిలియనీర్స్ ఉన్నారు... గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి 163 మంది కొత్తగా బిలియనీర్స్ గా అవతరించారు. వీరిలో ఇండియా నుండి శశాంక్, హర్షిల్ కు చోటు దక్కింది.