చమురును శుద్ధి చేసిన తర్వాత చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధర ప్రకారం చమురు ధరను నిర్ణయిస్తాయి. మూడవ ప్రధాన పాత్ర ప్రభుత్వం పోషిస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చమురుపై పలు రకాల పన్నులు విధిస్తున్నాయి.
ఇందులో రాష్ట్ర ప్రభుత్వం విధించే ఎక్సైజ్ సుంకం, వ్యాట్ ఉన్నాయి. ఆ తర్వాత డీలర్ కమీషన్ కూడా కలుపుతారు. వీటన్నింటిని జోడించిన తర్వాత మార్కెట్లో పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరను నిర్ణయిస్తారు. ప్రపంచంలోనే పెట్రోలు, డీజిల్ ధరలపై భారత్ అత్యధిక పన్ను విధిస్తుండటం గమనార్హం.