స్టార్టప్ ఇండియా నేపథ్యం..
దేశంలో స్టార్టప్ కంపెనీలకు ప్రోత్సాహం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం 2016లో స్టార్టప్ ఇండియా పథకాన్ని తీసుకొచ్చింది. నూతన ఆవిష్కరణలకు ప్రోత్సాహం, ఉద్యోగ సృష్టి, ఆర్థిక అభివృద్ధి, ఆర్థిక సాయంతో పాటు పన్ను రాయితీలు కల్పిస్తుంది. స్టార్టప్ ఇండియా ద్వారా కంపెనీలు ఏర్పాటు చేసిన వారికి 3 ఏళ్లపాటు పన్ను మినహాయింపు ఇస్తారు. 80 ఐఏసీ ప్రకారం ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ కోసం అదనంగా రూ. 2వేల కోట్లు కేటాయించనున్నట్లు ప్రకటించారు. వేగంగా పెరుగుతున్న డీప్ టెక్, ఏఐ, గ్రీన్ ఎనర్జీ వంటి స్టార్టప్లకు మద్ధతు ఇవ్వనున్నారు. జొమాటో, ఓలా, బైజూస్, పేటీఎమ్, నైకా, ఫార్మ్ఈజీ వంటి కంపెనీలన్నీ స్టార్టప్ ఇండియాలో భాగంగానే ఏర్పాటైనవే.