Budget 2025: మధ్యతరగతి ప్రభుత్వం ఉద్యోగులకు భారీ ఊరటనిస్తూ కేంద్ర ప్రభుత్వం కొత్త పన్ను విధానాన్ని తీసుకొచ్చింది. దీంతో రూ. 12 లక్షల ఆదాయం వరకు పన్ను మినహాయింపునిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రకటించారు. అలాగే ఐటీఆర్, టీడీఎస్ పరిమితిని కూడా పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. టీడీఎస్ పరిమితిని కూడా రూ.10 లక్షలకు పెంచారు. సవరించిన శ్లాబ్ కింద రూ.8 నుంచి రూ.12 లక్షల మధ్య ఆదాయంపై పన్ను 10 శాతం ఉంటుంది. పన్ను స్లాబ్లకు సవరణలను ప్రకటించగా, కొత్త పన్నువిధానానికి మాత్రమే ఇది వర్తిస్తుందన్నారు.
కొత్త ఆదాయపు పన్ను విధానంలో ట్యాక్స్ స్లాబ్స్ ఇవే:
* రూ. 0 నుంచి రూ.4 లక్షల వరకు. ఎలాంటి పన్ను లేదు..
* రూ.4 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు - 5 శాతం.
* రూ.8 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు 10 శాతం.
* రూ.12 లక్షల నుంచి రూ.16 లక్షల వరకు 15 శాతం
* రూ.16 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు 20 శాతం
* రూ.20 లక్షల నుంచి రూ.24 లక్షల వరకు 25 శాతం
* రూ.24 లక్షల పైన 30 శాతం
గతంలో రూ. 15 లక్షల ఆదాయం దాటిన వారంతా నేరుగా 30 శాతం శ్లాబ్లోకి వెళ్లేవారు. అయితే ప్రస్తుతం మరో రెండు శ్లాబ్లను తీసుకొచ్చారు. దీంతో రూ. 16 లక్షల నుంచి రూ. 24 లక్షల లోపు ఆదాయం తీసుకుంటున్న వారికి 15 శాతం పన్ను చెల్లింపులు మిగులుతుంది. వీరికి సుమారు ప్రతీ ఏటా రూ. లక్షా పదివేల వరకు పన్ను మినహాయింపు లభించనుంది.