షీల్డ్ అనేది ఒక సేఫ్టీ ప్లానింగ్ టాస్క్. ఇది వినియోగదారులను మోసాల నుంచి కాపాడుతుంది. ఫిషింగ్ ప్రయత్నాలు, అనధికారిక లావాదేవీల నుండి రక్షిస్తుంది. వినియోగదారులు తమ ఫోన్ను పోగొట్టుకున్నప్పటికీ అందులో ఉండే డాటా ద్వారా మోసపోకుండా కాపాడుతుంది.
వినియోగదారులు మొదటి 30 రోజులు ఈ సర్వీసును ఉచితంగా పొందవచ్చు. ట్రయల్ పీరియడ్ తర్వాత నెలకు కేవలం రూ.19 పే చేయాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ వల్ల మీరెప్పుడైనా ఆన్ లైన్ మోసానికి గురైతే రూ.5,000 వరకు కవరేజీని అందిస్తుంది.