జిఎస్టి కౌన్సిల్ కీలక నిర్ణయాలు :
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, దేశంలోని అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, అధికారులతో సమావేశం అయ్యారు. ఈ జిఎస్టి కౌన్సిల్ సమావేశం ఇంకా కొనసాగుతోంది. అయితే ఇందులో చర్చించి తీసుకున్న నిర్ణయాలు బయటకు వచ్చాయి.
మనం సరదాగా తినే పాప్ కార్న్ పై కూడా ట్యాక్స్ విధించారు. సాల్ట్ లేదా మసాలా పాప్ కార్న్ ప్యాక్ చేయకుండా అమ్మితే దానిపై 5 శాతం, ప్యాక్ చేసి అమ్మితే 12 శాతం, షుగర్ కలిపిన పాప్ కార్న్ అయితే 18 శాతం జిఎస్టి విధించారు.
ఇక పోర్టిఫైడ్ రైస్ పై ట్యాక్ ను తగ్గించారు. ఇప్పటివరకు వీటిపై 18 శాతంగా వున్న జిఎస్టిని 5 శాతానికి తగ్గించనున్నారు.
ఆటోక్లేవ్డ్ ఏరేటెడ్ కాంక్రీట్ (AAC) బ్లాక్స్ లో 50 శాతం కంటే ఎక్కవ ప్లై యాష్ వుంటే 12 శాతం జిఎస్టి వుండనుంది.