చెక్ క్లియరెన్స్ అండ్ లోన్ మంజూరు వంటి సేవలు
ఈరోజు సమ్మె రెండో రోజు ఆయితే సమ్మె తొలిరోజు దేశవ్యాప్తంగా బ్యాంకుల సేవలు ప్రభావితమైయ్యాయి. బ్యాంకులు మూతపడడంతో డిపాజిట్, విత్డ్రా, చెక్కు క్లియరెన్స్, లోన్ మంజూరు వంటి సేవలు నిలిచిపోవడంతో ఆయా బ్యాంకుల ఖాతాదారులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. దేశవ్యాప్త సమ్మెకు ముందు రోజు ఖాతాదారులు, పెట్టుబడిదారులు, ఇతర వాటాదారులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (AIBEA) ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం తెలిపారు. 37,000 కోట్ల విలువైన 39 లక్షల చెక్కులు నిలిచిపోయాయి. అలాగే బ్యాంకులను ప్రైవేటీకరించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన సుమారు ఏడు లక్షల మంది ఉద్యోగులు సమ్మెకు దిగారని ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (ఏఐబీఓసీ) జనరల్ సెక్రటరీ సౌమ్య దత్తా తెలిపారు. దేశవ్యాప్తంగా ఒక లక్షకు పైగా బ్యాంకులు(banks) ఇంకా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల శాఖలు మూతపడ్డాయి. అయితే, ప్రైవేట్ రంగ బ్యాంకులైన హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్లలో సేవలు సాధారణంగానే ఉన్నాయి.