ఇదిలా ఉండగా క్రిప్టోకరెన్సీలకు సంబంధించి భారత్లో కొనసాగుతున్న ఆందోళనలపై అంతర్జాతీయ ద్రవ్యనిధి (IMF) చీఫ్ ఎకనామిస్ట్ గీతా గోపీనాథ్ మాట్లాడుతూ క్రిప్టోకరెన్సీలను నిషేధించే బదులు దానిని నియంత్రణలోకి తీసుకురావడం చాలా ముఖ్యమని అన్నారు.
గ్లోబల్ పాలసీ
ఐఎంఎఫ్ చీఫ్ ఎకనామిస్ట్ గీత మాట్లాడుతూ ఆర్థిక వ్యవస్థలు క్రిప్టోకరెన్సీలను నిషేధించకుండా రెగ్యులేట్ చేయాలని అన్నారు. దీనిపై గ్లోబల్ పాలసీ కూడా రూపొందించాలని సూచించారు. ఒక కార్యక్రమంలో గోపీనాథ్ ప్రసంగిస్తూ.. నిషేధించే విధానంలో చాలా సవాళ్లు ఉన్నాయని అన్నారు. మీరు నిజంగా క్రిప్టోను నిషేధించగలరా, ఎందుకంటే చాలా ఎక్స్ఛేంజీలు ఆఫ్షోర్లో ఉన్నాయి అలాగే అవి ఏదైనా నిర్దిష్ట దేశం నిబంధనలకు లోబడి ఉండవు.