మొదటి ఏడాదిలో ఒక ఎకరానికి సుమారు 25,000 కిలోల ఆకులు, రెండో ఏడాదిలో 30,000 కిలోల వరకు దిగుబడి వస్తుంది. ఒక్కో ఆకును లేదా మొక్కను ప్రాసెసింగ్ యూనిట్లకు అమ్మడం ద్వారా రైతులు మంచి లాభాలు పొందుతారు.
ఒక ఎకరంలో సుమారు 12,000 మొక్కలు నాటితే, రూ.40,000–50,000 పెట్టుబడి అవసరం. మార్కెట్ ధర ఆధారంగా ఒక్క మొక్కకు రూ.10 వరకు లభిస్తే, రూ.1.2 లక్షల వరకు ఆదాయం వస్తుంది. పెద్ద స్థాయిలో సాగు చేస్తే, ప్రాసెసింగ్ యూనిట్లతో బైబ్యాక్ ఒప్పందాల ద్వారా లాభాలను ఐదు రెట్లు పెంచుకోవచ్చు.