అలర్ట్: సెప్టెంబర్ 1 నుండి పి‌ఎఫ్ కొత్త రూల్స్.. వెంటనే ఇలా చేయండి లేదంటే..?

Ashok Kumar   | Asianet News
Published : Aug 09, 2021, 04:43 PM ISTUpdated : Aug 09, 2021, 04:53 PM IST

కరోనా కాలంలో  ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయారు. చాలా మంది  ప్రావిడెంట్ ఫండ్ (పిఎఫ్) డబ్బును కూడా ఉపసంహరించుకోవలసి వచ్చింది. కానీ కొంతమందికి ఇప్పటికీ వారి పి‌ఎఫ్ ఖాతా గురించి సరైన సమాచారం లేదు. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈ‌పి‌ఎఫ్‌ఓ)  ఖాతాదారుల కోసం నియమాలలో కొన్ని మార్పులు చేసింది. 

PREV
15
అలర్ట్: సెప్టెంబర్ 1 నుండి పి‌ఎఫ్ కొత్త రూల్స్.. వెంటనే ఇలా చేయండి లేదంటే..?

 మీరు వీటిని  జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇది మీపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది.  ఈ‌పి‌ఎఫ్‌ఓ  కొత్త నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరూ వారి పి‌ఎఫ్ ఖాతాను ఆధార్ కార్డుతో లింక్ చేయడం తప్పనిసరి. ఈ నియమం సెప్టెంబర్ 1 నుండి అంటే వచ్చే నెల నుండి వర్తిస్తుంది. దీనిని జూన్ 1 నుండి అమలు చేశారు, కానీ ఇప్పుడు దాని గడువు పెరిగింది. మీ పి‌ఎఫ్ ఖాతా ఆధార్‌తో లింక్ చేయకపోతే పి‌ఎఫ్ ఖాతాకు వచ్చే డబ్బు నిలిపివేయబడుతుంది. ఇలాంటి పరిస్థితిలో, ఎలక్ట్రానిక్ చలాన్ అండ్ రిటర్న్ (ECR) నింపలేరు.

25

ఈ‌పి‌ఎఫ్‌ఓ  అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా మీరు మీ ఖాతాను ఆధార్‌తో లింక్ చేయవచ్చు. ఇందుకు ముందుగా మీరు ఈ‌పి‌ఎఫ్‌ఓ ​​వెబ్‌సైట్‌కి వెళ్లండి. ఇందుకోసం కింద ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేయండి. https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/

35
ఇప్పుడు మీ యూ‌ఏ‌ఎన్ అండ్ పాస్‌వర్డ్‌తో ఖాతాకు లాగిన్ చేయండి.

ఇప్పుడు 'మేనేజ్' విభాగంలో కే‌వై‌సి ఆప్షన్ పై క్లిక్ చేయండి.

ఇప్పుడు మీ ముందు ఓపెన్ అయిన పేజీలో మీ ఈ‌పి‌ఎఫ్ ఖాతాతో లింక్ చేయడానికి డాక్యుమెంట్స్  చూస్తారు.

ఇందులో ఆధార్ ఆప్షన్ ఎంచుకోండి తరువాత  ఆధార్ కార్డుపై ఉన్న మీ ఆధార్ నంబర్, మీ పేరును టైప్ చేసి సేవ్ పై క్లిక్ చేయండి.

దీని తర్వాత మీరు ఇచ్చిన సమాచారం సెక్యూర్ అవుతుంది మీ ఆధార్ యూ‌ఐ‌డి‌ఏ‌ఐ డేటాతో వేరిఫై అవుతుంది.

మీ కే‌వై‌సి డాక్యుమెంట్స్  కరెక్ట్  అయిన తర్వాత మీ ఆధార్ మీ పి‌ఎఫ్ ఖాతాతో లింక్ చేయబడుతుంది. మీ ఆధార్ సమాచారం ముందు వెరిఫైడ్ అని  చూపిస్తుంది.
 

45
ఈ‌పి‌ఎఫ్ సబ్ స్క్రైబర్స్ కోవిడ్ అడ్వాన్స్

మార్చి 2020లో కూడా ప్రభుత్వం ఈ‌పి‌ఎఫ్ సబ్ స్క్రైబర్స్ కి ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన (పి‌ఎం‌జి‌కే‌వై) కింద అడ్వాన్స్ సదుపాయాన్ని ఇచ్చింది. మేలో కార్మిక మంత్రిత్వ శాఖ నాన్-రీఫండబుల్  సెకండ్ కోవిడ్ -19 అడ్వాన్స్‌ని ఉపసంహరించుకోవడానికి అనుమతించింది. దీని కింద మీరు మీ పి‌ఎఫ్ ఖాతాలో డిపాజిట్ మొత్తంలో 75 శాతం లేదా మూడు నెలల వేతనానికి సమానమైన మొత్తాన్ని (ప్రాథమిక జీతం అండ్ డియర్‌నెస్ అలవెన్స్) ఉపసంహరించుకోవచ్చు.
 

55
click me!

Recommended Stories