దేశంలో పెరుగుతున్న కాలుష్యం వల్ల విద్యుత్తు ప్రొడక్షన్ కూడా కష్టంగా మారింది. నదులు, నీటి వనరులు తగ్గిపోవడం కూడా భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ తయారీకి ఇబ్బందులు తప్పేలా లేవు. ఇలాంటి సమస్యలన్నిటికీ చెక్ పెట్టేలా కేంద్ర ప్రభుత్వం నేచురల్ రిసోర్సెస్ ని వినియోగించేందుకు ప్రత్యేక పథకాలు అమలు చేస్తోంది. అందులో ముఖ్యమైన పథకమే పీఎం సూర్య ఘర్ యోజన.
దేశంలోని సామాన్య ప్రజలకు సహాయం చేయడానికి, పర్యావరణాన్ని రక్షించడానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి సూర్య ఘర్ ఉచిత విద్యుత్ పథకం ద్వారా 300 యూనిట్ల కరెంటు మీరు ఇంటి అవసరాలకు వాడుకోవచ్చు. ఓ సామాన్య, మధ్య తరగతి కుటుంబం మాక్సిమం 150 యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్తు వినియోగించలేరు.