బ్యాంకుల కంటే పోస్ట్ ఆఫీసులో 5 సంవత్సరాల FD మెరుగైన వడ్డీ రేటును అందిస్తుంది. ఈ పథకం ద్వారా మీరు కోరుకుంటే ఈ మొత్తాన్ని మూడు రెట్లు పెంచుకోవచ్చు. అంటే మీరు రూ.5,00,000 పెట్టుబడి పెడితే రూ.15,00,000 కంటే ఎక్కువ సంపాదించవచ్చు. అది ఎలాగో ఇక్కడ తెలుసుకుందాం రండి.
రూ.5 లక్షలను రూ.15 లక్షలుగా మార్చడం ఇలా..
రూ.5 లక్షలను రూ.15 లక్షలుగా మార్చడానికి మీరు ముందుగా 5 సంవత్సరాలకు పోస్ట్ ఆఫీస్ FDలో రూ.5,00,000 పెట్టుబడి పెట్టాలి. పోస్ట్ ఆఫీస్ 5 సంవత్సరాల FDకి 7.5 శాతం వడ్డీని అందిస్తుంది. ప్రస్తుత వడ్డీ రేటు ప్రకారం లెక్కించినట్లయితే 5 సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీ మొత్తం రూ.7,24,974 అవుతుంది. ఈ మొత్తాన్ని మీరు విత్ డ్రా చేయవద్దు. మరో 5 సంవత్సరాలకు దాన్ని కొనసాగించండి.