అదరగొడుతున్న రివాల్ట్ ఆర్‌వి400 ఎలక్ట్రిక్ బైక్.. ప్రారంభించిన నిమిషాల్లోనే బుక్కైనా బైక్స్..

First Published Jul 16, 2021, 1:53 PM IST

ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ భారతదేశంలో రోజురోజుకి పెరుగుతుంది. రెండవ రౌండ్ బుకింగ్ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే రివాల్ట్ మోటార్స్ ఆర్‌వి 400, ఆర్‌వి 300 ఎలక్ట్రిక్ బైక్‌ల  మొత్తం యూనిట్లను విక్రయించినట్లు రివాల్ట్ మోటార్స్ గురువారం ప్రకటించింది. 

మొదటి రౌండ్ బుకింగ్ ప్రారంభించిన రెండు గంటల్లో మెరుపు వేగంగా బైక్స్ అమ్ముడయ్యాయి. అయితే, రెండు రౌండ్ లో ఎన్ని బైక్‌లను అమ్మకానికి ఉంచారో తెలియదు. ప్రస్తుతం కంపెనీ దీని గురించి సమాచారాన్ని వెల్లడించలేదు.
undefined
రివాల్ట్ మోటార్స్ భారత మార్కెట్లో రెండు ఉత్పత్తులను మాత్రమే విక్రయిస్తుంది. కానీ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. సంస్థ ఆర్‌వి400 భారతదేశపు మొదటి ఎలక్ట్రిక్ బైక్. ఆర్‌వి400 టాప్ ఎండ్ వేరియంట్ కాగా ఆర్‌వి300 బేస్ వేరియంట్. ఈ భారతీయ సంస్థ 2019లో ఈ ఉత్పత్తులను ప్రారంభించింది, అప్పటి నుండి భారీ డిమాండ్ రావడంతో బుకింగ్స్ చాలా త్వరగా ప్రారంభించింది. ఆర్‌వి400 రివాల్ట్ మోటార్స్ ప్రైమరీ మోడల్. ఈ మోడల్‌ను మొదటి రౌండ్‌లో రూ .50 కోట్ల విలువగల బైకులను అమ్మినట్లు కంపెనీ పేర్కొంది. ఇంతకుముందు బుక్ చేసుకున్నా లక్కీ కస్టమర్లకు ఆర్‌వి 400 ఎలక్ట్రిక్ బైక్‌ను డెలివరీలకు కూడా ప్రారంభించింది.అందువల్ల పెరిగిన డిమాండ్రివాల్ట్ మోటార్స్ బైకులపై పెరుగుతున్న ఆసక్తి కారణం పెట్రోల్ ధరలు పెంపు అని సంస్థ పేర్కొంది. రతన్ ఇండియా ఎంటర్‌ప్రైజెస్ బిజినెస్ చైర్మన్ అంజలి రతన్ మాట్లాడుతూ “రివాల్ట్ బైక్‌లు కేవలం నిమిషాల్లోనే బుక్ అయ్యాయి, ఇది రివాల్ట్ ఉత్పత్తి నాణ్యతకు బలమైన నిదర్శనం. పెట్రోల్ ధరలు దేశంలో రూ .100 మార్క్ దాటడంతో వాహనదారులు రివాల్ట్ కొనుగోలు చేయాల్సిన సమయం ఆసన్నమైంది. "రివాల్ట్ మోటార్స్ ప్రజల డిమాండ్‌ను తీర్చడానికి ఉత్పత్తిని కూడా పెంచుతోందని చెప్పారు. రివాల్ట్ మోటార్స్ ఎండి రాహుల్ శర్మ మాట్లాడుతూ, "ఈ భారీ డిమాండ్ ని తీర్చడానికి మా ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత పెంచడానికి మేము నిరంతరం పని చేస్తున్నాము."అని చెప్పారు.
undefined
రివాల్ట్ ఆర్‌వి 400 ధరవివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన రాయితీలు రివాల్ట్ మోటార్స్ వంటి ఈవీ తయారీదారుల ఆసక్తిని కూడా పెంచాయి. ఫేమ్ ఇండియా (ఫాస్ట్ అడాప్షన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ స్ట్రాంగ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇన్ ఇండియా) పథకం కింద భారత ప్రభుత్వం అందించిన సబ్సిడీకి కృతజ్ఞతలు తెలుపుతూ రివాల్ట్ మోటార్స్ ఇటీవల బైక్ ధరను రూ .28,000 వరకు తగ్గించింది. తాజా ధర తగ్గింపు తరువాత రివాల్ట్ ఆర్‌వి 400 ఎక్స్-షోరూమ్ ధర ఇప్పుడు రూ.90,799 . అంతకుముందు ఢీల్లీలో దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.1,18,999. గుజరాత్ ప్రభుత్వ కొత్త ఎలక్ట్రిక్ వాహన విధానం ప్రకారం ఈ బైక్ ధర ఇప్పుడు అహ్మదాబాద్ లో రూ .87,000కు అమ్ముడవుతోంది. మహారాష్ట్రలో ఈ బైక్‌కు సుమారు రూ .25 వేల సబ్సిడీ ప్రోత్సాహకం లభిస్తుండగా, గుజరాత్‌లో ఈ బైక్‌పై రూ .20,000 సబ్సిడీ లభిస్తుంది.పవర్, స్పీడ్, రేంజ్ఎలక్ట్రిక్ బైక్ రివాల్ట్ ఆర్‌వి 400లో కంపెనీ 5 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటారును ఇచ్చింది. ప్రత్యేక విషయం ఏమిటంటే ఈ బైక్‌కు 3.24 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ లభిస్తుంది. దీనిలో ఎకో, నార్మల్ అండ్ స్పోర్ట్స్ అనే మూడు రైడింగ్ మోడ్‌లు లభిస్తాయి. బైక్ టాప్ స్పీడ్ 85 కి.మీ. రివాల్ట్ ఆర్‌వి 400 ఎలక్ట్రిక్ బైక్‌లో చాలా శక్తివంతమైన బ్యాటరీ అందించారు. ఈ బ్యాటరీ సింగిల్ ఫుల్ పూర్తి ఛార్జ్‌తో 156 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. ఈ బైక్ బ్యాటరీని 4 నుండి 5 గంటల్లో ఫుల్ ఛార్జ్ చేయవచ్చు. రివాల్ట్ ఆర్‌వి 400 బైక్‌తో కంపెనీ 8 సంవత్సరాల వరకు లేదా 1.5 లక్షల కిలోమీటర్ల వరకు వారంటీ ఇస్తుంది. దేశంలో ఇతర ద్విచక్ర వాహనాలకంటే ఇది అత్యధికం.
undefined
ఫీచర్స్ఫుల్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ పానెల్, జియో లొకేషన్, నియర్ బై ఛార్జింగ్ స్టేషన్ వివరాలు, దీనితో పాటు స్పీకర్, ఎగ్జాస్ట్ సౌండ్ ఫీచర్ ఈ బైక్‌లో లభిస్తుంది. అంటే శబ్దం లేని ఎలక్ట్రిక్ బైక్‌ను నడుపుతున్నప్పుడు మీరు ఎగ్జాస్ట్ సౌండ్ ఫీచర్‌ను ఆన్ చేయవచ్చు. దీనివల్ల పెట్రోల్ బైక్ లాగా ఉంటుంది. డ్రైవర్లు తమ ఇష్టానుసారం దీని ఆన్ లేదా ఆఫ్ చేయవచ్చు.
undefined
100 కి.మీలకి రూ .9 చొప్పున ఖర్చు.కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహకాలు దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ప్రోత్సహించడానికి ప్రభుత్వం తీవ్రతను చూపుతాయి. బ్యాటరీ ధరలు తగ్గడంత ఇవి బైకుల ధరలు ఇప్పటికే పెట్రోల్ ప్రతిరూపాలతో సమానంగా ఉన్నాయి. పెట్రోల్ బైక్‌లతో పోలిస్తే ఈ ఎలక్ట్రిక్ బైక్‌లకు చాలా తక్కువ ఖర్చు ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ బైక్ నడిపేందుకు మీకు 100 కిలోమీటర్లకు రూ .9 ఖర్చు అవుతుంది. పెట్రోల్ బైక్ నడపడానికి 100 కి.మీకి రూ .250 ఖర్చు అవుతుంది.
undefined
click me!