పాకిస్థాన్‌పై భారత్ విజయానికి గుర్తుగా జావా స్పెషల్‌ ఎడిషన్‌ బైక్స్‌.. ఆర్మీ చిహ్నంతో విడుదల..

First Published Jul 14, 2021, 6:28 PM IST

1971లో పాకిస్థాన్‌పై జరిగిన యుద్ధంలో భారతదేశం సాధించిన విజయానికి గుర్తుగా స్వర్నిమ్ విజయ్ వర్ష్‌లో భాగంగా జావా మోటార్‌సైకిల్స్ ఆదివారం రెండు కొత్త  కలర్ ఆప్షన్స్ విడుదల చేసింది. 
 

అర్మేడ్ ఫోర్స్ ప్రేరణతో జావా ఇప్పుడు ఖాఖీ అండ్ మిడ్ నైట్ గ్రే అనే రెండు కలర్లలో లభిస్తుంది. జావా స్పెషల్ ఎడిషన్‌లో ఇండియన్ ఆర్మీ చిహ్నంతో పాటు ఇంధన ట్యాంకుపై త్రివర్ణ రంగు ఉంటుంది.
undefined
"50 సంవత్సరాల క్రితం భారత సాయుధ దళాలు దురాక్రమణకు అడ్డుగా నిలిచాయి. చరిత్రలో జరిగిన అతి తక్కువ గొప్ప యుద్ధాలలో అద్భుతమైన విజయాన్ని సాధించాయి. 1971 వార్ విక్టరీ 50 సంవత్సరాలను పురస్కరించుకొని #SwarnimVijayVarsh జరుపుకోవడం మాకు గర్వంగా ఉంది" అని జావా మోటార్ సైకిల్స్ ట్విట్టర్ లో తెలిపింది.
undefined
మహీంద్రా అండ్ మహీంద్రా ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా జావా బృందాన్ని అభినందించారు. "భారత సాయుధ దళాల #ఫారెవర్ హీరోస్ బృందానికి ఈ అంకితభావం గర్వంగా ఉంది.
undefined
జావా స్పెషల్ ఎడిషన్ ధర 1.93 లక్షలు (ఢీల్లీ ఎక్స్-షోరూమ్). జావా ఫోర్టీ టు కంటే 15వేలు ఇంకా స్టాండర్డ్ జావా కంటే 6,000 ఖరీదైనది.కస్టమర్లు జావా అధికారిక వెబ్‌సైట్‌లో స్పెషల్ ఎడిషన్ బైక్ ని ఆన్‌లైన్‌ ద్వారా బుక్ చేసుకోవచ్చు.
undefined
click me!