లైసెన్స్ అవసరం లేదు.. 100 కి.మీ ప్రయాణించొచ్చు.. ఎంత ఖర్చు అవుతుందంటే..?

First Published Nov 4, 2023, 4:52 PM IST

ఇండియాలో ఎలక్ట్రిక్ స్కూటర్లు ఎంతో ప్రజాదరణ పొందుతున్నాయి. కొత్త కొత్త కంపెనీల నుండి ఎలక్ట్రిక్ స్కూటర్లు లాంచ్ ఆవుతున్నాయి. అయితే ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఒడిస్సే ఓడిస్ ఇ2గో గ్రాఫేన్‌ ఎలక్ట్రిక్ స్కూటర్ ని విడుదల చేసింది, ఈ స్కూటర్ ఫుల్ ఛార్జ్‌తో 100 కి.మీ వరకు ప్రయాణించగల హై-ఎండ్ ఎలక్ట్రిక్ స్కూటర్. రూ.63,550 ధర ఉన్న  ఈ స్కూటర్ ఆరు ఆకర్షణీయమైన కలర్స్ లో వస్తుంది. ఇంకా అధునాతన ఫీచర్లను అందిస్తుంది.
 

Odysse E2GO గ్రాఫేన్ 8 గంటల్లో ఛార్జ్ ఫుల్ చేయబడుతుంది, దీనిని నడపడానికి లైసెన్స్ కూడా అవసరం లేదు. మీరు దీన్ని ఆన్‌లైన్ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్‌లో సౌకర్యవంతంగా కోనవచ్చు. మెరుగైన వ్యూ  ఇంకా  భద్రత కోసం స్కూటర్ కి పెద్ద హెడ్‌లైట్‌  ఉంది.
 

ఒడిస్సే E2GO గ్రాఫేన్

ఒడిస్సే ఎలక్ట్రిక్ ఈ స్కూటర్‌లో USB ఛార్జింగ్ పోర్ట్, యాంటీ థెఫ్ట్ లాక్, కీలెస్ యాక్సెస్ ఇంకా  డిజిటల్ స్పీడోమీటర్ వంటి లేటెస్ట్  ఫీచర్లు ఉన్నాయి.  అల్లాయ్ వీల్స్, భారీ సస్పెన్షన్ ఇంకా  పర్ఫార్మెన్స్  అండ్  భద్రత కోసం డిస్క్ బ్రేక్‌లు కూడా ఉన్నాయి. ఫ్యూచరిస్టిక్ డిజైన్ దీని ఆకర్షణకు మరింత లుక్ ఇస్తుంది.

E2GO గ్రాఫేన్

ఒడిస్సే E2GO గ్రాఫేన్ - ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.51,094, ఐదు కలర్స్  అప్షన్స్ లో ఒకే వేరియంట్‌ను అందిస్తోంది. ఈ స్కూటర్ ముందు భాగంలో డిస్క్ బ్రేక్, వెనుక డ్రమ్ బ్రేక్‌తో భద్రతకు ప్రాధాన్యతనిస్తుంది. యో డ్రిఫ్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ 25 kmph స్పీడ్ అందుకోగలదు, ఇంకా ప్రతిరోజు ఉండే  ప్రయాణాలకి అనువైనది.

ఎలక్ట్రిక్ వాహనం

 ఈ ఎలక్ట్రిక్ స్కూటర్  పూర్తిగా ఛార్జ్ చేయడానికి సుమారు 8 గంటలు పడుతుంది, టెలిస్కోపిక్ ఫోర్కులు అండ్  మోనోషాక్ సస్పెన్షన్‌  ఉంది. దీని ద్వారా సౌకర్యవంతమైన, సాఫీగా ప్రయాణించేలా చేస్తుంది. అదనపు హైలైట్‌లలో LED హెడ్‌ల్యాంప్‌లు, డిజిటల్ కన్సోల్, త్రీ-ఇన్-వన్ లాక్ సిస్టమ్, కీలెస్ స్టార్ట్, రివర్స్ మోడ్ అండ్  అదనపు సౌలభ్యం కోసం మొబైల్ ఛార్జింగ్ సాకెట్ ఉన్నాయి.

click me!