రోల్స్ రాయిస్‌ కార్లపై చెప్పలేనంత ఇష్టం - దర్శనానికి రూ.14 కోట్లు - సోషల్ మీడియాలో వైరల్‌!

First Published Oct 3, 2023, 1:02 PM IST

రోల్స్ రాయిస్ కార్ల గురించి చిన్నప్పటి నుంచి ఎన్నో విషయాలు, అపోహలు వింటూనే ఉంటున్నాం. 1990 నాటి ప్రజలు రోల్స్ రాయిస్ కార్లను చాలా తరాలుగా ఉన్న ధనవంతులకు మాత్రమే ఇస్తారని అని నమ్ముతూ ఉండేవారు. 
 

ప్రపంచంలోని ఇతర లగ్జరీ కార్లతో పోల్చినప్పుడు రోల్స్ రాయిస్ కార్ల ధర కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ ఎల్లప్పుడూ ప్రత్యేకమైన అట్రాక్షన్ ఉంటుంది. నేటికీ రోల్స్ రాయిస్ కార్లు కొనడం అనేది ఒక వ్యక్తికి జీవిత కల అని చెప్పవచ్చు. అయితే అంబానీ కుటుంబానికి సంబంధించినంత వరకు  రోల్స్ రాయిస్ కార్లను సొంతం చేసుకునేంత ధనవంతులని మనకు తెలుసు. 
 

అంబానీ కుటుంబానికి రోల్స్ రాయిస్ కార్లంటే అమితమైన ప్రేమ అని చెబుతారు. కారణం వారి ఇంట్లో  ఒకటి కాదు రెండు కాదు ఏకంగా  నాలుగు రోల్స్ రాయిస్ కార్లు  ఉన్నాయి. 

ఈ క్రమంలో అంబానీ కుమారుడు అనంత్ అంబానీ  తాజాగా వినాయగర్ చతుర్థి కార్యక్రమానికి హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. అయితే అతను  నాలుగు రోల్స్ రాయిస్ కార్లలోని  ఒక  కారులో ఈ ఈవెంట్‌కు వచ్చాడు. 

 6.75 లీటర్ ట్విన్ టర్బోజెట్, పి12 పెట్రోల్ ఇంజన్ ఉన్న ఈ కారును రథం అని పిలుస్తారంటే అతిశయోక్తి కాదు. అనంత్ అంబానీ కారు విలువ దాదాపు రూ. 7 కోట్లు, అయితే రోల్స్ రాయిస్ నుంచి చాలా మార్పులు చేసి కస్టమైజ్ చేయడంతో దీని విలువ దాదాపు రూ.14 కోట్లు ఉంటుందని చెబుతున్నారు. 

 లగ్జరీ కారులో షోకు వచ్చిన వీడియోను ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానెల్ పోస్ట్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడం గమనార్హం.

click me!