పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర తీసుకున్న ఈ నిర్ణయానికి సోషల్ మీడియాలో మంచి స్పందన లభించింది. అథ్లెట్లకు ఇలాంటి అభినందనలు అవసరమని మరొక ట్విటర్ యూజర్ అన్నారు.ఇంకో వినియోగదారుడు ఇతర కార్పొరేషన్లు కూడా దీనిని అనుసరిస్తాయని, అథ్లెట్లకు రివార్డ్ చేస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు.
పారాలింపిక్ స్వర్ణ పతకాన్ని గెలుచుకున్న మొదటి భారతీయురాలిగా మాత్రమే కాకుండా తన స్కోరు 249.6 తో కొత్త పారాలింపిక్ రికార్డును నెలకొల్పిన ఘనత కూడా అవని లేఖర సొంతం చేసుకోంది. జైపూర్కు చెందిన 19 ఏళ్ల అవనికి 2012లో జరిగిన కారు ప్రమాదంలో వెన్నుముక్కకి గాయాలయ్యాయి.