నీటిలో కూడా హై కెపాసిటీతో మహీంద్రా థార్‌కి పోటీగా సరికొత్త ఎస్‌యూవీ.. దీని స్పెషాలిటీ ఏంటంటే..?

First Published Sep 14, 2021, 2:08 PM IST

దేశీయ ఆటోమోబైల్ మహీంద్ర అండ్ మహీంద్ర కంపెనీ సరికొత్త ఎస్‌యూవీ మహీంద్రా థార్‌ కి పోటీగా ఈ వారంలో కొత్త ఎస్‌యూవీ రాబోతోంది. దీని పేరు ఫోర్స్ గుర్ఖా 2021. లాంచ్ కి ముందే ఈ ఎస్‌యూ‌వి  కొన్ని వివరాలు వెల్లడయ్యాయి. ఇందులో దీని డిజైన్, ఫీచర్లు, లుక్ వెల్లడించారు. ఇటీవల ఫోర్స్ మోటార్స్ ఈ అద్భుతమైన ఎస్‌యూ‌వి టీజర్‌ను కూడా విడుదల చేసింది.

దీని కాన్సెప్ట్ గత ఏడాది ఆటో ఎక్స్‌పోలో కంపెనీ ప్రదర్శించింది. వైడ్ గ్రిల్, రౌండ్ ఆకారంలో ఎల్‌ఈ‌డి హెడ్‌లైట్లు ఈ ఎస్‌యూ‌వి హై లెట్లలో ఒకటి. గుర్ఖా బ్యాడ్జింగ్ కూడా దాని హెడ్‌లైట్లపై కనిపిస్తుంది.  

కొత్త గూర్ఖాలో డ్రైవర్ వైపు స్నార్కెల్ కాకుండా ఈ ఎస్‌యూ‌వికి రీడిజైన్ చేసిన బోనెట్ లభిస్తుంది. ఈ మార్పులు 2021 గుర్ఖా ఎస్‌యూవీని నీటిలో నడిచే అధిక సామర్థ్యం కలిగిన వాహనంగా మార్చడానికి చేసింది. ఫోర్స్ గుర్ఖాలో రీడిజైన్ టెయిల్‌లైట్లు, కొత్త సెట్ వీల్స్, టెయిల్‌గేట్-మౌంటెడ్ స్పేర్ వీల్, ఫంక్షనల్ రూఫ్ క్యారియర్‌ని చూడవచ్చు.

ఫోర్స్ మోటార్స్ కొత్త గూర్ఖా ఇంటీరియర్ ఫీచర్లను కూడా వెల్లడించింది, ఈ ఎస్‌యూ‌వి ఆల్-బ్లాక్ కలర్ థీమ్‌ని పొందే అవకాశం ఉంది. క్యాబిన్‌లో తక్కువ ఎన్‌విహెచ్ ఉండేలా  మొల్దెడ్ ఫ్లోర్ మ్యాట్‌లను పొందుతుంది. స్పీడ్ అండ్ ఆర్‌పిఎమ్ కోసం  సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, డిజిటల్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ ఇచ్చారు.  

ఫోర్-సీటర్ వెర్షన్ 2021 ఫోర్స్ గుర్ఖాలో వెనుక కెప్టెన్ సీట్లను పొందుతుంది. వెనుక ఉన్న ఇద్దరు వ్యక్తుల కోసం ఆర్మ్‌రెస్ట్‌లు కూడా ఉంటాయి. సీట్లపై గుర్ఖా బ్యాడ్జింగ్ దీనికి ప్రీమియం టచ్ ఇస్తుంది. మహీంద్రా థార్ లాగే పెద్ద సైడ్ విండోస్ కూడా  డ్రైవర్ ఇంకా ప్యాసెంజర్లకు క్లియర్ వ్యూ చూసేందుకు సహాయపడతాయి. 

2021 ఫోర్స్ గుర్ఖా ఎస్‌యూవీ 2.6-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో వస్తుంది. ఈ ఎస్‌యూ‌వి గరిష్టంగా 89 బిహెచ్‌పి పవర్, 260 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయగలదు. ఇంజిన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో 4X4 మోడ్ కోసం ప్రత్యేక గేర్ లివర్‌తో జతచేశారు. ప్రస్తుతం ఫోర్స్ గుర్ఖా భారతదేశంలో మహీంద్రా థార్‌తో మాత్రమే పోటీ పడుతుంది. ధర గురించి మాట్లాడుతూ ఈ కొత్త ఫోర్స్ గుర్ఖా ధర రూ.10 లక్షల నుండి రూ.12 లక్షల మధ్య ఉంటుంది

click me!