Today Horoscope: ఈ రాశివారికి ధనప్రాప్తి.. గౌరవం

First Published May 18, 2022, 7:00 AM IST

Today Horoscope:  రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికీ నష్టాలుంటాయి. మొత్తం రాశుల వారికి ఎలా ఉంటుందో  ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.

 మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :-  
 
  మిత్రులతో అకారణవైరం. దూరప్రయాణాలు. మానసిక అశాంతి. ఉద్యోగావకాశాలు చేజారవవచ్చు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు. ఇతరులసహాయం తీసుకుంటారు. వృత్తి,వ్యాపారాల యందు చిక్కులు. సంఘంలో గొడవలు. ఊహించని ఖర్చులు. రుణ బాధ. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకొనవలెను. పనులలో జాప్యం. ఓం సుబ్రహ్మణ్యాయ నమః అను మంత్రమును 21 మార్లు జపించి నా శుభం జరుగును.
 

వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి  :-  

చేయు పనులయందు ఆటంకాలు. ఎక్కువగా కష్టపడతారు. అవసరమైన ఆలోచనలు చేస్తారు. మిత్రులతో అకారణవైరం. దూరప్రయాణాలు. మానసిక అశాంతి. ఉద్యోగావకాశాలు చేజారవవచ్చు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు. సంఘంలో గొడవలు. వృత్తి వ్యాపారాల యందు నిరాశ. ప్రయాణాలలోజాగ్రత్తలు తీసుకొనవలెను. క్రయవిక్రయాల తెలివిగా వ్యవహరించవలెను. మానసిక ఒత్తిడి. ఓం నమశ్శివాయ అను మంత్రము 21 మార్లు జపించి నా శుభం జరుగును.

మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :-  

అనవసర ఖర్చులు. పనుల యందు నిరాసక్తత.  ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి. ఆత్మీయులతో విరోధాలు. ధనవ్యయం. శ్రమాధిక్యం. పనుల్లో అవాంతరాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు క్లిష్టంగా మారతాయి.  అకారణంగా కోపం. వస్తు వాహన ప్రాప్తి. పోయిన వస్తువు తిరిగి లభించుట. అధికారులతో ఇబ్బందులు. ఓం సుబ్రహ్మణ్యాయ నమః అను మంత్రమును 21 మార్లు జపించి నా శుభం జరుగును.
 

కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- 

శుభవార్తలు వింటారు. వ్యాపారాల యందు ధనలాభం. సన్నిహితులతో మాటపట్టింపులు. ధనవ్యయం. కుటుంబంలో సమస్యలు. కష్టానికి ఫలితం కనిపించదు. ఆస్తులపై వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.గృహము నందు శుభకార్యములు. బంధు మిత్రుల కలయిక. సంఘంలో పేరు ప్రతిష్టలు. తలపెట్టిన కార్యములు పూర్తి చేస్తారు. ఆనందంగా గడుపుతారు. ఓం నమో నారాయణాయ అను మంత్రమును 21 సార్లు జపించిన శుభం జరుగును.

సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :-

ఇతరుల సహాయంతో చేయవలసిన పని పూర్తి చేస్తారు. సంఘంలో చికాకులు. కొన్ని సమస్యలు మానసిక ఒత్తిడి. ఊహించని ఖర్చులు. వృత్తి వ్యాపారాలలో నిరాస. కొత్త ఆలోచనలు చేస్తారు. ఆర్థిక పరమైన చిక్కులు. రాస్తి కొనుగోలు విషయంలో తెలివిగా వ్యవహరించాలి. దుర్గాదేవి ఆరాధన చేసిన శుభం జరుగును.

కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- 

అనవసరమైన ఖర్చులు. వృత్తి వ్యాపారాల యందు సామాన్యం. ప్రయాణాలు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగుల చికాకులు. వ్యవహారాల్లో ఆచితూచి అడుగులు వేయాలి. అనుకున్న పనులు వాయిదా వేసుకుంటే మంచిది. అకారణంగా కోపం. బంధుమిత్రులతో కలహాలు. సూర్యారాధన చేస్తే శుభం జరుగును.
 


తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- 

అన్ని పనులకు అనుకూలం.  చాకచక్యంగా సమస్యలు పరిష్కరించుకుంటారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. వాహనయోగం. చర్చలు సఫలం.  వృత్తి,వ్యాపారాలలో లాభం. రావలసిన బకాయిలు వసూలగును. పోగొట్టు పోయిన వస్తువు దొరుకుట. సంఘంలో గౌరవ ప్రతిష్ఠలు. బంధుమిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు.ఓం నమశ్శివాయ అను మంత్రమును 21 సార్లు జపించిన శుభం జరుగును.
 

వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- 

శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాల యందు లాభం. సంఘంలో గౌరవ ప్రతిష్ఠలు. కార్యాలకు శ్రీకారం చుడతారు. తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు. మానసిక ప్రశాంతత. విద్యార్థులకు అనుకూలం. ఓందుర్గాయై నమః అనే మంత్రమును 21 మార్లు జపించిన శుభం జరుగును.
 

ధనుస్సు రాశి  ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :-

ఇతరులకు సహాయం చేస్తారు. తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ ప్రతిష్ఠలు. స్థిరాస్తి కొనుగోలు విషయంలో ఆచితూచి అడుగులు వేయవలెను. వృత్తి వ్యాపారాల యందు సామాన్యం. రుణ బాధలు. విద్యార్థులకు అనుకూలం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసిన శుభం జరుగును.
 


మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- 

బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. మిత్రులతో కలహాలు. ఎంత కష్టించినా ఫలితం కనిపించదు. ఆస్తుల వివాదాలు. అనారోగ్య సూచనలు. ఆకస్మిక ధన లాభం. కొత్త వ్యక్తుల పరిచయాలు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల యందు లాభం. కొత్త ఆలోచనలు చేస్తారు. వస్తు వాహన ప్రాప్తి. మహాలక్ష్మీ నమః అనే మంత్రమును 21 మార్లు జపించి న శుభం జరుగుతుంది
 

కుంభరాశి  ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :-

అవసరమైన గొడవలు. మానసిక ఒత్తిడి. చెడు స్నేహాలకు దూరంగా ఉండవలెను. కష్టించిన పనులలో లాభం చేకూరును. సమస్యలు ఏర్పడతాయి.ఆత్మీయులతో విరోధాలు. ధనవ్యయం. శ్రమాధిక్యం. పనుల్లో అవాంతరాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు క్లిష్టంగా మారతాయి. అవసరమైన ఆలోచనలు చేస్తారు. ఉద్యోగ వ్యాపారాలలో సామాన్యంగా ఉంటుంది. ఓం దుర్గాయై నమః అను మంత్రమును 21 సార్లు జపించిన శుభం జరుగును.

మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :-

చేయు పనులయందు ఆలస్యం. అకారణంగా కోపం. బంధుమిత్రులతో కలహాలు. అనవసరంగా ధనాన్ని ఖర్చు చేస్తారు. ఉద్యోగ వ్యాపారాల యందు నిరాశ. ప్రయాణాల్లో కొత్త విషయాలు వింటారు. మానసిక ఒత్తిడి. ఓం సూర్యాయ నమః అనే మంత్రమును 21 మార్లు జపించిన శుభం జరుగును.
 

పంచాగం
 
శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం
వైశాఖ మాసం
బ.విదియ పగలు05:43ని‌.ల వరకు తదుపరి తదియ
జ్యేష్ఠ నక్షత్రం ఉదయం 11:11ని|| వరకు
వర్జ్యం సా.06:37ని.ల లగాయతు సా.08:07ని.లవరకు
దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:30ని. లగాయతు 12:21ని.ల వరకు 
రాహుకాలం మధ్యాహ్నం 12:00ని.ల లగాయతు మధ్యాహ్నం 01:30ని.ల వరకు
యమగండం ఉదయం 07:30ని.ల లగాయతు ఉదయం.09:00ని.ల వరకు
సూర్యోదయం ఉదయం 5:31ని.లకు
సూర్యాస్తమయం సాయంత్రం 6:21ని.లకు.

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

click me!