హిందూమతంలో వంట చేయడానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందుకే వంట చేయడం, తినడం వంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా హిందూ మతం ప్రకారం.. ఫుడ్ ను ప్రిపేర్ చేసేటప్పుడు అస్సలు రుచి చూడకూడదని జ్యోతిష్యులు చెబుతున్నారు.
అయితే చాలా మంది ఆడవారు వంటల్లో ఉప్పు, కారం వంటివి సరిపోయాయా? లేదా? అని టేస్ట్ చూస్తుంటారు. ఇది చాలా కామన్. కానీ జ్యోతిస్యుల ప్రకారం.. వంట చేసేటప్పుడు టేస్ట్ అస్సలు చూడకూడదు. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
అన్నపూర్ణ తల్లికి కోపం
కూరలో ఉప్పు, లేదా కారం వంటివి సరిగ్గా సరిపోయాయా? లేదా? అని తెలుసుకోవడానికి, ఏవైనా సరిపోకపోతే వేయడానికి మనలో చాలా మంది టేస్ట్ చూస్తుంటారు. కానీ జ్యోతిష్యం ప్రకారం.. వంట చేసేటప్పుడు దాని రుచి అస్సలు చూడకూడదని చెప్తారు. ఇలా చేస్తే అన్నపూర్ణ దేవికి కోపం వస్తుందని నమ్ముతారు.