Lunar Eclipse: మార్చిన 3 చంద్రగ్రహణం. గ్రహణం అనగానే మొదట గుర్తొచ్చేది దర్భగడ్డి. గ్రహాణం ప్రారంభమయ్యే ముందు తినడానికి సంబంధించిన అన్ని వస్తువుల్లోనూ దీన్ని వేస్తారు. అలా ఎందుకు వేస్తారో తెలుసా?
చంద్రగ్రహణం, హోలీ కూడా ఇదే రోజు పడింది. మార్నింగ్ 11 లోపు భోజనం చేసేయాలని పండితులు చెబుతున్నారు. మధ్యాహ్న 3 నుంచి సాయంత్రం ఆరున్నర వరకు ఈ గ్రహణ ప్రభావం ఉంటుంది. ప్రెగ్నెంట్ లేడీస్ జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. గ్రహణానికి రెండు గంటల ముందే భోజనం చేసి, గ్రహణం వీడాక స్నానం చేసి, ఇళ్లు శుద్ధి చేయాలని పండితులు చెబుతున్నారు.
24
భారతీయ సంప్రదాయాల్లో దర్భ గడ్డికి ప్రత్యేక స్థానం
భారతీయ సంప్రదాయాల్లో దర్భ గడ్డికి ప్రత్యేక స్థానం ఉంది. ఇది మతపరమైన, సాంస్కృతిక, ఆధ్యాత్మిక నమ్మకాలతో ముడిపడి ఉంది. హిందూ మత ఆచారాల్లో దర్భను శుద్ధి, రక్షణకు సూచికగా భావిస్తారు. హిందూ మతంలో దర్భ వినియోగం విస్తృతంగా కనిపిస్తుంది. పూజా స్థలాన్ని శుద్ధి చేయడానికి, యజ్ఞాల్లో అగ్నికి సమర్పణ చేసే సమయంలో, పూజారి చేతిలో లేదా వేళ్లలో దర్భతో చేసిన ఉంగరాన్ని ధరించడం వంటి ఆచారాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. వివాహాలు, ఉపనయనం వంటి శాస్త్రోక్త కార్యక్రమాల్లో కూడా దర్భకు స్థానం ఉంది. తర్పణం వంటి పితృకార్యాల్లో దర్భ లేకుండా ఆచారం పూర్తికాదని భావిస్తారు.
34
దర్భగడ్డి ప్రతికూల శక్తులను దూరం చేస్తుందని నమ్మకం
దర్భగడ్డి కోసం పురాణాల ప్రకారం రకరకాల కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. వృత్రాసురుడిని సంహరించడానికి బ్రహ్మ దేవుడు ఇంద్రుడి వజ్రాయుధాన్ని పవిత్ర జలంలో ముంచి శక్తినిచ్చినట్లు చెబుతారు. ఆ దైవిక శక్తి తాకిన జల వనరులు దర్భగా మారినట్టు పురాణాలు చెబుతున్నాయి. మరొక పురాణంలో గరుడుడు స్వర్గం నుంచి అమృతాన్ని తీసుకువస్తున్న సమయంలో కొన్ని చుక్కలు దర్భపై పడటంతో పడి పవిత్రతను పొందినట్లు చెబుతారు. అంతేకాకుండా క్షీరసాగర మథనం సమయంలో శ్రీ మహావిష్ణువు వెంట్రుకలు పడిపోతాయంట. అప్పుడు అవి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి వాటికి పవిత్రత వస్తుందని చెబుతారు. దర్భ గడ్డిని పూజా స్థల శుద్ధి కోసం ఉపయోగిస్తారు. ప్రతికూల శక్తులను దూరం చేస్తుందని నమ్మకం. రాహుకేతువుల ప్రభావం పడకుండా ఈ దర్భ అడ్డుకుంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
గ్రహణ కాలాన్ని హిందూ సంప్రదాయాలు కీడు సమయంగా పరిగణిస్తారు. అందువల్ల ఆ సమయంలో వంట, భోజనం చేయరు. ముందుగానే వండిన ఆహారంపై, ముఖ్యంగా ఊరగాయలపై, దర్భను ఉంచే ఆచారం ఉంది. ఇది ఆహారాన్ని అపవిత్రత నుంచి కాపాడుతుందని నమ్మకం. అలాగే నీటిలో దర్భ ఉంచడం ద్వారా నీరు కలుషితం కాకుండా ఉంటుందని విశ్వసిస్తారు. గ్రహణ వాతావరణంలో మార్పులు సంభవిస్తాయని విశ్వసిస్తారు. ఈ సమయంలో యూవీ కిరణాలు అధికంగా ప్రభావం చూపుతాయని భావించి, ఆహారం, నీరు, ధాన్యాలపై దర్భ గడ్డిని ఉంచే ఆచారం ఏర్పడింది. దర్భకు శుద్ధి చేసే స్వభావం ఉందని నమ్ముతారు. ఆహారం త్వరగా పాడవకుండా కాపాడుతుందని పెద్దలు చెబుతారు.ఈ ఆచారం ఇప్పటికీ అనేక ఇళ్లలో పాటిస్తున్నారు.
దర్భ గడ్డి నిటారుగా నిలబడుతుంది. అందువల్ల అది సూర్యశక్తిని గ్రహిస్తుంది. ముఖ్యంగా గ్రహణకాలంలో భూమికి చేరే హానికరమైన కిరణాలను దర్భ తన సహజ శక్తితో అడ్డుకుంటుందని చెబుతారు.