రాత్రి 01:13 కే భారత్‌ ఎందుకు దాడులకు దిగింది..జ్యోతిష్యశాస్త్రం ప్రకారం యుద్ధానికి నాంది పలికిందా?

Published : May 07, 2025, 10:13 AM IST

పహల్గామ్ దాడికి ప్రతిగా భారత సైన్యం పాక్‌లో ఆపరేషన్ సింధూర్ చేపట్టి ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. మే 7 అర్థరాత్రి 01:13 గంటలకే ఎందుకు దాడులకు దిగింది.జ్యోతిష్య శాస్త్రం ప్రకారం భారత  ఆర్మీ  ఈ దాడులు నిర్వహించిందా అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

PREV
15
రాత్రి 01:13 కే భారత్‌ ఎందుకు దాడులకు దిగింది..జ్యోతిష్యశాస్త్రం ప్రకారం యుద్ధానికి నాంది పలికిందా?
ఆపరేషన్ సింధూర్

పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి భారత సైన్యం మేలైన సమయాన్ని ఎంచుకొని ప్రతీకారం తీర్చుకుంది. మే 6-7 మధ్య రాత్రి 1:13 గంటలకు భారత వైమానిక దళం పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారీ దాడి చేసింది. దీనికి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు. ఈ దాడిలో అనేక మంది ఉగ్రవాదులు హతమయ్యారు.

25
విజయమే ఎదురుగా

దాడి జరిగిన మరుసటి రోజే భారత సైన్యం సోషల్ మీడియాలో ఒక సందేశం పోస్టు చేసింది:“ప్రహారాయ సన్నిహిత, జయ ప్రక్షిత”అంటే — దాడి సమీపంలో ఉంది, విజయమే ఎదురుగా ఉంది అని అర్థం.

35
ఈ సమయాన్నే ఎందుకు ఎంచుకున్నారు?

ఈ సమయాన్నే ఎందుకు ఎంచుకున్నారు?

పండిట్ నళిన్ శర్మ అనే జ్యోతిష్కుడి మాటల ప్రకారం, మే 6-7 రాత్రి శుక్ల పక్ష దశమి తేదీ. ఇది వైశాఖ మాసంలోని పవిత్రమైన తిథులలో ఒకటి. జ్యోతిష శాస్త్రంలో దశమి తిథికి యమధర్మరాజు అధిపతి. యముడు మృతి మరియు న్యాయం కోసం ప్రసిద్ధుడు.

ఈ రాత్రి "వ్యాఘాత యోగం" ఏర్పడిన సమయం కూడా. వ్యాఘాత అనగా రహస్యంగా దాడి చేయడం లేదా శత్రువులకు హాని కలిగించడం. ఇది విజయానికి అనుకూలమైన యోగంగా భావిస్తారు.

45
గ్రహస్థితి కూడా అనుకూలంగా ఉండటం విశేషం

దాడి జరిగిన సమయంలో చంద్రుడు సింహరాశిలో ఉన్నాడు. ఇది అత్యంత శక్తివంతమైన రాశిగా పరిగణిస్తారు.. దీనికి అధిపతి సూర్యుడు — తొమ్మిది గ్రహాలకూ నాయకుడు. సింహరాశిలో చంద్రుడి ఉనికి భారత సైన్యానికి శక్తిని, ధైర్యాన్ని ఇచ్చినదిగా విశ్వసిస్తున్నారు.

55
మంగళవారం-బుధవారం కలయిక శుభప్రదం

దాడి మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు జరిగింది. మంగళవారం దినాధిపతి మంగళుడు — యుద్ధాన్ని సూచించే గ్రహం. బుధవారం ఆర్థిక వ్యవస్థను సూచించే గ్రహం. పండితుల అభిప్రాయం ప్రకారం, ఈ రెండు కలయిక యుద్ధంలో విజయానికీ, శత్రువులకు నష్టానికి సంకేతం.

Read more Photos on
click me!

Recommended Stories