Trigrahi Yogam: మూడు గ్రహాలు ఒకే రాశిలో కలిసి వచ్చినప్పుడు త్రిగ్రహి యోగం ఏర్పడుతుంది. ఈ యోగం ఒక ప్రత్యేకమైన పరిస్థితిని సృష్టిస్తుందని అంటారు. మార్చి 15 తర్వాత ఈ యోగం ఎంతో ప్రత్యేకంగా మారుతుంది. మూడు రాశుల వారికి విపరీతంగా కలిసి వచ్చేలా చేస్తుంది.
హోలీ తర్వాత త్రిగ్రహ యోగం ఏర్పడబోతోంది. మార్చి 15న మూడు ప్రధాన గ్రహాలైన సూర్యుడు, శని, శుక్రుడు మీనరాశిలో కలవబోతున్నాయి. ఈ మూడు ప్రధాన గ్రహాలు పేదరికాన్ని పోగొట్టి ధనవంతులను చేసే శక్తిని కలిగి ఉంటాయి. ఈ శక్తివంతమైన గ్రహాలు ముఖ్యంగా మూడు రాశుల వారి అదృష్టాన్ని మార్చబోతున్నాయి. ఆ మూడు రాశులు ఏవో తెలుసుకోండి.
24
వృషభ రాశి
వృషభ రాశి వారికి త్రిగ్రమ యోగం వల్ల డబ్బు కుప్పలు కుప్పలుగా వచ్చి పడుతుంది. వీరు ఎంతో కాలంగా ఇబ్బంది పడుతున్న అప్పులు తీరిపోతాయి. ఆర్థిక ఇబ్బందులు రావు. విదేశాలలో ఉద్యోగం చేయాలని కలలు కంటున్న వారికి ఇదే మంచి సమయం. పనిచేసే చోటా పేరు పెరుగుతుంది. ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఆదాయ మార్గాలు కూడా తెరుచుకుంటాయి. నిలిచిపోయిన డబ్బు తిరిగి చేతికి అందుతుంది. బ్యాంకు బ్యాలెన్స్ కూడా పెరుగుతుంది.
34
మిథున రాశి
మిథున రాశి వారికి శుభకరమైన సమయం ఇది. సూర్యుడు, శని, శుక్రుని ఆశీస్సులు వీరిపై ఉంటాయి. అప్పులను తీర్చేస్తారు. కోర్టు కేసులు ఏమైనా ఉంటే అవి వీరికి అనుకూలంగా తీర్పు వస్తాయి. కొత్త అతిధి లేదా కొత్త వాహనం ఇంటికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సొంతంగా స్టార్టప్ లేదా వ్యాపారం నడుపుతున్న వారికి పెద్ద ఆర్డర్ రావచ్చు. కుటుంబంతో సంబంధాలు మెరుగుపడతాయి. ఇంట్లోని వాతావరణం కూడా సంతోషంగా మారుతుంది.
మార్చి నెల కుంభ రాశి వారికి స్వర్ణ కాలమని చెప్పాలి. ఈ రాశికి అధిపతి శని.. కాబట్టి త్రిగ్రహ యోగం వల్ల కుంభ రాశి వారిపై సానుకూల ప్రభావం పడుతుంది. వీరు చాలా కాలంగా ఇల్లు లేదా భూమి కొనాలని ఆలోచిస్తుంటే మార్చిలో కొనే అవకాశం ఉంది. ఏదైనా పెట్టుబడి పెట్టడానికి కూడా ఇదే ఉత్తమ సమయం. మీ కెరీర్ ఉత్తమ స్థాయికి చేరుకుంటుంది. పాత పెట్టుబడులు నుంచి ఊహించిన దాని కంటే ఎక్కువ రాబడిని పొందుతారు.