చంద్రబాబు జాబితాలో రాహుల్ గాంధీ కోటా: ఆ నలుగురు వీరే
First Published Mar 13, 2019, 4:38 PM ISTఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల మధ్య అవగాహన చాలా పకడ్బందీగా అమలవుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో అధికారంలోకి రాలేమని గ్రహించిన ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ లోకసభ సీట్లపైనే దృష్టి పెట్టినట్లు అర్థమవుతోంది. దీంతో బలమైన నేతలను తెలుగుదేశంలోకి పంపించి వారికి లోకసభ టికెట్లు ఇప్పించుకుంటున్నట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.