ఫైర్ బ్రాండ్ రోజా మౌనం, కారణం ఇదేనంటూ ఆసక్తికర చర్చ

First Published May 15, 2019, 5:38 PM IST

హైదరాబాద్: ఏపీ రాజకీయాల్లో ఆమె ఫైర్ బ్రాండ్. తన మాటల తూటాలతో అధికార పార్టీకే కాదు ఇతర పార్టీలకు చుక్కలు చూపిండంలో ఆమెకు ఆమె సాటి. పార్టీ అధినేత తర్వాత అన్ని అంశాలపై అవగాహన కలిగిన నేత ఆమె. 
 

హైదరాబాద్: ఏపీ రాజకీయాల్లో ఆమె ఫైర్ బ్రాండ్. తన మాటల తూటాలతో అధికార పార్టీకే కాదు ఇతర పార్టీలకు చుక్కలు చూపిండంలో ఆమెకు ఆమె సాటి. పార్టీ అధినేత తర్వాత అన్ని అంశాలపై అవగాహన కలిగిన నేత ఆమె.
undefined
తనను ఏమైనా ఆలస్యంగా స్పందిస్తారేమో కానీ తమ పార్టీని, తమ అధినేతను ఏమైనా అంటే ఒంటికాలిపై లేస్తారు. ఇక అసెంబ్లీలో అయితే ఆమె రాకపోతే హమ్మయా సేఫ్ అనుకునే మంత్రులు కూడా లేకపోలేదట. ఇంతకీ ఆమె తెలిసే ఉంటుంది కదూ. ఆమె నగరి ఎమ్మెల్యే, వైసీపీ రాష్ట్రమహిళా అధ్యక్షురాలు రోజా.
undefined
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేత ఆమె. ఎన్నికల ప్రచారం ముందు వరకు అధికార పార్టీపై నిప్పులు చెరిగిన ఆమె ఎన్నికల అనంతరం సైలెంట్ అయిపోయారు. ఎన్నికల అనంతరం కాస్త రిలాక్సేషన్ కోసం కుటుంబ సభ్యులతో కలిసి టూర్ కి వెళ్లిన ఆమె తిరిగి వచ్చినా అసలు మాట్లాడటం లేదు.
undefined
రోజాకు ఏమైంది బొత్తిగా మాట్లాడటం లేదు అనే ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని నిప్పులు చెరుగుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరినీ వదలడం లేదు.
undefined
అధినేత వైఎస్ జగన్ నుంచి మెుదలుపెడితే విజయసాయిరెడ్డి, షర్మిల, వైఎస్ విజయమ్మలపై తన పదునైన మాటలతో విరుచుకుపడుతున్నారు. అవకాశం దొరికితే చాలు వైఎస్ జగన్ పై విరుచుకుపడుతున్నారు. కనీసం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా అనని విధంగా సాధినేని యామిని ఘాటు విమర్శలు చేస్తున్నారు.
undefined
మరోవైపు అవకాశం దొరికినప్పుడు టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి సైతం వైసీపీపై పంచ్ లు వేస్తున్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ జైలుకే నంటూ విరుచుకుపడుతున్నారు. జగన్ అధికారంలోకి వస్తే ఏపీలో ఫ్యాక్షనిజం పెరిగిపోతుందంటూ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.
undefined
వీరిద్దరూ ఇలా ఉంటే టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న డైలీ వైసీపీని విమర్శించడమే పనిగొ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. వైసీపీని తిట్టనిదే రోజు గడవదన్నట్లు బుద్దా వెంకన్న తీరు ఉంది. వైసీపీపైనా, వైఎస్ జగన్, విజయసాయిరెడ్డిలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు బుద్దా వెంకన్న.
undefined
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపైనా, వైసీపీ అధినేత జగన్ ఆయన కుటుంబంపై ఎవరైనా ఆరోపణలు చేస్తే నిమిషం కూడా ఆలస్యం చెయ్యకుండా ఘాటుగా సమాధానం చెప్పే రోజా ఇప్పుడు బొత్తిగా మౌనం వహించడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
undefined
ఎన్నికల అనంతరం టూర్ లకు వెళ్లి తిరిగి వచ్చినా ఆమె రాజకీయాలపై నోరు మెదపకపోవడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. వైఎస్ జగన్ రోజాను చెల్లి అంటూ పిలుస్తారు. తమ కుటుంబంలో ఒక ఆడపడుచు అంటూ చెప్తారు.
undefined
అలాంటిది వైఎస్ జగన్ ను టీడీపీ నేతలు తీవ్రంగా విమర్శిస్తుంటే రోజా స్పందిచకపోవడం వెనుక ఏమైనా కారణాలు ఉన్నాయా అంటూ చర్చ జరుగుతోంది. గతంలో టీడీపీ నేతలు సాధినేని యామిని, దివ్యవాణి, బుద్ధా వెంకన్నలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చిన రోజా ఎన్నికల అనంతరం మూగబోవడం వెనుక కారణం ఏమై ఉంటుందని ఆసక్తికర చర్చ జరుగుతోంది.
undefined
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలి హోదాలో అయినా టీడీపీ మహిళా నేతలకు కౌంటర్ ఇవ్వొచ్చని కానీ అలా ఇవ్వకపోవడంపై వైసీపీలో కూడా చర్చ జరుగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ రోజా ఆ తర్వాత మహిళా నేత వాసిరెడ్డి పద్మ మాత్రమే స్పందిస్తున్నారు.
undefined
ఆమె కూడా గత కొద్ది రోజులుగా మీడియా ముందుకు రావడమే మానేశారు. రోజా ఎమ్మెల్యే అయినప్పటికీ సాక్షాత్తు చంద్రబాబును సైతం ఇరుకున పెట్టే నాయకురాలు. అలాంటిది ఆమె సైలెంట్ గా ఉండటం వెనుక లేనిపోని చర్చ జరుగుతోంది.
undefined
నగరి నియోజకవర్గం ఎన్నికల ఫలితాల్లో ఏమైనా మిశ్రమ ఫలితాలు వస్తాయని రోజాలో భయాందోళన మెుదలైందా లేక మే 23 తర్వాతే స్పందించాలని అప్పటి వరకు సైలెంట్ గా ఉండాలని రోజా నిర్ణయించుకున్నారా అంటూ పలు ప్రశ్నలు తొలచివేస్తున్నాయి.
undefined
జబర్దస్త్, తస్మాత్ జాగ్రత్త వంటి ప్రోగ్రాంలలో బిజీబిజీగా గడుపుతున్న రోజా వైసీపీపై విమర్శలు వెల్లువెత్తుతున్న ఖండిచాల్సింది పోయి కిమ్మనుకుండా ఉండటం వెనుక ఏదో వ్యూహమే ఉందంటూ ప్రచారం జరుగుతోంది. మరి ఆ వ్యూహం ఏంటో తెలియాలంటే మే 23 వరకు వేచి చూడాల్సిందే.
undefined
click me!