ఈ ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలకు హైఅలర్ట్..
ఆంధ్ర ప్రదేశ్ లోని రుతుపవనాలు నాలుగైదు రోజుల ముందే ప్రవేశించాయి... దీంతో ప్రస్తుతం వర్షాలు జోరందుకున్నాయి. నేడు ఆంధ్ర ప్రదేశ్ లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. ముఖ్యంగా పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని... ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. అల్లూరి సీతారామరాజు, మార్కాపురం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రకటించింది.
భారీ వర్షాలకు ఉరుములు మెరుపులు, పిడుగులు, ఈదురుగాలులు తోడై ప్రమాదకరంగా మారే అవకాశాలున్నాయని APSDMA తెలిపింది. కాబట్టి వర్షం కురిసే సమయంలో చెట్లకింద, తాత్కాలిక నివాసాల్లో ఉండకూడదని... సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని ప్రజలకు సూచించింది. హెచ్చరికలు జారీచేసిన జిల్లాల్లోనే కాదు మిగిలిన జిల్లాల్లోనూ అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపిఎస్డిఎంఏ తెలిపింది.