IMD Rain Alert : ఏపీలో 7, తెలంగాణలో 7 జిల్లాలకు హైఅలర్ట్.. భారీ నుండి అతిభారీ వర్షాలతో అల్లకల్లోలమే

Published : Jun 09, 2026, 07:31 AM ISTUpdated : Jun 09, 2026, 07:40 AM IST

Weather Update : తెలంగాణ 7 జిల్లాలు, ఆంధ్ర ప్రదేశ్ లో 7 జిల్లాలు మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లోని 14 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఇరురాష్ట్రాల వాతావరణ శాఖలు హెచ్చరించాయి. 

PREV
14
రుతుపవనాల ఎఫెక్ట్... తెలుగు రాష్ట్రాల్లో జోరువానలు

IMD Rain Alert : ఇప్పటికే తెలుగు రాష్ట్రాలను నైరుతి రుతుపవనాలు తాకాయి... దీంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు (జూన్ 9, మంగళవారం) కూడా ఇరు రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖలు హెచ్చరిస్తున్నాయి. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేశాయి. మరి ఏఏ ప్రాంతాలకు భారీ వర్షసూచనలు ఉన్నాయో తెలుసుకుందాం.

24
ఈ ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలకు హైఅలర్ట్..

ఆంధ్ర ప్రదేశ్ లోని రుతుపవనాలు నాలుగైదు రోజుల ముందే ప్రవేశించాయి... దీంతో ప్రస్తుతం వర్షాలు జోరందుకున్నాయి. నేడు ఆంధ్ర ప్రదేశ్ లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. ముఖ్యంగా పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని... ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. అల్లూరి సీతారామరాజు, మార్కాపురం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రకటించింది.

భారీ వర్షాలకు ఉరుములు మెరుపులు, పిడుగులు, ఈదురుగాలులు తోడై ప్రమాదకరంగా మారే అవకాశాలున్నాయని APSDMA తెలిపింది. కాబట్టి వర్షం కురిసే సమయంలో చెట్లకింద, తాత్కాలిక నివాసాల్లో ఉండకూడదని... సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని ప్రజలకు సూచించింది. హెచ్చరికలు జారీచేసిన జిల్లాల్లోనే కాదు మిగిలిన జిల్లాల్లోనూ అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపిఎస్డిఎంఏ తెలిపింది.

34
నేడు తెలంగాణలో భారీ వర్షాలు...

నేడు (మంగళవారం) తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, వరంగల్, హన్మకొండ, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయట. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని హెచ్చరించింది. ఈ రెండుమూడు రోజులు వర్షాలు కొనసాగుతాయట... దీంతో ఎండల తీవ్రత పూర్తిగా తగ్గి 30-35 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెబుతోంది.

44
తెలంగాణలో అత్యధిక వర్షపాతం నమోదైన ప్రాంతాలివే..

నిన్న (జూన్ 8, సోమవారం) తెలంగాణలో భారీ వర్షాలు కురిశాయి… అత్యధికంగా సూర్యాపేట జిల్లా మట్టపల్లెలో 88.5 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. ఇక రంగారెడ్డి జిల్లా కందుకూరులో 78, కడ్తాల్ లో 45.3, మహేశ్వరంలో 38.8 మిల్లిమీటర్లు... నల్గొండ జిల్లా దామరచర్లలో 67, ఖమ్మం జిల్లా వైరాలో 63.4, రఘునాధపాలెంలో 46.9, మధిరలో 37.5, నిజామాబాద్ జిల్లా సిరికొండలో 41.1, ములుగు జిల్లా మల్లంపల్లిలో 39.3 మి.మీ వర్షపాతం నమోదయినట్లు తెలంగాణ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటి (TGDPS) ప్రకటించింది.

Read more Photos on
click me!

Recommended Stories