ప్రస్తుతం ప్రతిఒక్కరు ఉపయోగిస్తున్న శాస్త్ర సాంకేతికత రంగాల ప్రతిఫలాల వెనక ఎందరో శాస్త్రవేత్తల త్యాగాలు దాగి వున్నాయని పవన్ అన్నారు.జీవితంలో సుఖాలను, సంతోషాలను, బాధలను, బంధాలను సైతం త్యాగం చేసిన ఎందరో శాస్త్రవేత్తలు పనిచేసారు... అందువల్లే ఈ టెక్నాలజీ సాధ్యమయ్యిందన్నారు. అంతరిక్ష పరిశోదనల్లో ప్రపంచ దేశాల ముందు భారత్ సగర్వంగా నిలబడిందంటే అందుకు ఎందరో మహానుభావులు కారణమన్నారు. తమ సొంత కుటుంబాలను, ఇష్టాలను వదులుకొని... అవమానాలు, అవహేళనలను పట్టించుకోకుండా ముందుకు సాగిన గొప్ప వ్యక్తుల సాహస ప్రయాణ ఫలితమే ప్రస్తుత ఇస్రో అని పవన్ కల్యాణ్ తెలిపారు.