జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధన సంస్థ (షార్) ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన పవన్... శాస్త్రవేత్తలు, షార్ సిబ్బందితో పాటు చిన్నారులు, కళాశాల యువతను ఉద్దేశించి ప్రసంగించారు.