100 రోజుల ప్రణాళికలో భాగంగా పౌరసరఫరాల శాఖ బకాయిల్లో రూ. 10 వేల కోట్లు తిరిగి చెల్లించడంతో పాటు 10 వేల కొత్త రేషన్ షాపులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఫెయిర్ ప్రైస్ షాపులు తీసుకువచ్చి బియ్యం, కందిపప్పుతోపాటు చక్కెర, ఫామ్ ఆయిల్ ఇతర నిత్యావసరాలు అందచేసే ఏర్పాటు చేస్తున్నామన్నారు. త్వరలో బియ్యం నాణ్యత పెంచే విధంగా చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు.