మొత్తం మూడు రోజులలో కుదిరిన పెట్టుబడుల్లో సగానికి పైగా సీఎం సమక్షంలోనే జరిగాయి. చంద్రబాబు సమక్షంలో కుదిరిన ఒప్పందాల విలువ రూ. 7,63,210 కోట్లకు చేరింది. ఈ పెట్టుబడులు మొత్తం 123 ఎంఓయూల ద్వారా కుదిరాయి.
రోజువారీ ప్రకారం చూస్తే..
• మొదటి రోజు: రూ. 3,65,304 కోట్లు
• రెండో రోజు: రూ. 3,49,476 కోట్లు
• మూడో రోజు: రూ. 48,430 కోట్లు
అదనంగా, మంత్రుల సమక్షంలో కుదిరిన పెట్టుబడులు రూ. 5,62,506 కోట్లకు చేరగా, వీటి కోసం మొత్తం 490 ఎంఓయూలు కుదిరాయి. ఐటీ మంత్రి నారా లోకేష్ సహా పలు శాఖల మంత్రులు పెట్టుబడులు కుదుర్చడంలో కీలక పాత్ర పోషించారు.