రామ్మోహన్ నాయుడు మూడుసార్లు ఒకే పార్టీ నుంచి ఒకే పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అలాగే, మూడుసార్లు శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులపైనే గెలుపొందారు. 2014లో రెడ్డి శాంతిపై, 2019లో దువ్వాడ శ్రీనివాస్పై, ఈసారి పేరాడ తిలక్పై 3.27 లక్షల ఓట్ల భారీ ఆధిక్యంతో గెలిచారు.