ఇదిలావుంటే బడ్జెట్ లోనూ ఆంధ్ర ప్రదేశ్ కు భారీగా నిధలను కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. ఎన్డీఏలో కీలక బాగస్వాములుగా వున్న టిడిపి, జనసేన అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ లు కేంద్రం నుండి నిధులు రాబట్టడంలో కీలకంగా వ్యవహరించారు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం భారీగా నిధులు కేటాయించింది.