ప్రస్తుతం తిరుమలలో సాధారణంగా రోజుకు 70,000 మంది భక్తులు దర్శనానికి వస్తుండగా, పండుగలు, బ్రహ్మోత్సవాలు వంటి ప్రత్యేక సందర్భాల్లో ఈ సంఖ్య రెండు లక్షలకు పైగా పెరుగుతుంది. ఇటువంటి తరుణాల్లో భక్తులకు మరింత భద్రత అవసరమని గుర్తించిన టీటీడీ, వారి ప్రయాణాన్ని సురక్షితంగా మార్చేందుకు ప్రముఖ బీమా సంస్థలతో చర్చలు ప్రారంభించింది.ప్రస్తుతం టీటీడీ అందిస్తున్న బీమా కవరేజ్ పరిమితంగా ఉంది. అలిపిరి నుండి తిరుమల వరకు ఘాట్ రోడ్డులో జరిగే ప్రమాదాల్లో మరణించినవారికి రూ.3 లక్షల పరిహారం మాత్రమే అందుతోంది. సహజ మరణాలకు ఈ బీమా వర్తించదు. అంతేకాదు, కొద్ది భక్తులకే ఇది అందుబాటులో ఉంటుంది. టూరిజం ప్యాకేజీలలో మాత్రమే బీమా సౌకర్యం ఉందని అధికారులు పేర్కొన్నారు.