పర్యాటకుల కోసం ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ మరో ముందడుగు
ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (APTDC) పర్యాటకుల కోసం మరో ముందడుగు వేస్తూ తిరుపతి నుండి నాలుగు కొత్త బస్సు సర్వీసు ప్యాకేజీలను ప్రవేశపెట్టింది. ఈ ప్యాకేజీలను ఉపయోగించడం ద్వారా పర్యాటకులు కాణిపాకం, కోయంబత్తూర్, మైసూర్, రామేశ్వరం, మధురై, ఊటీ, కన్యాకుమారి, అరుణాచలం, గోల్డెన్ టెంపుల్ లను సందర్శించవచ్చు. ప్యాకేజీలలో ఆహారం, వసతిని కూడా కల్పించనున్నారు.