తాము గెలిస్తే.. పన్నులు తగ్గిస్తామని, అభివృద్ది చేపడుతామని, జగన్ రెడ్డి ఎత్తేసిన అన్నా క్యాంటీన్ తెరుస్తామని, చెత్తపై విధించిన పన్ను ఎత్తేస్తామని లోకేష్ వివరించారు. జగన్ రెడ్డి కటింగ్ మాస్టర్ అని, ఓటు వేయకపోతే పెన్షన్ కట్ చేస్తామని, రేషన్ కట్ చేస్తామని, సంక్షేమ పథకాలు కట్ చేస్తామని వైసీపీ వాళ్లు బెదిరిస్తున్నారని అన్నారు.