అనంతపురం : ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో వున్న ఏపీ మాజీ సీఎం, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు భద్రతపై కుటుంబసభ్యులు, టిడిపి శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా చంద్రబాబుకు సరైన వైద్యం అందించడంలేదని... కోర్టు ఆదేశించినా సరైనా సదుపాయాలు కల్పించడం లేదని నారా లోకేష్ ఆరోపిస్తున్నారు. నారా భువనేశ్వరి సైతం భర్త ఆరోగ్యంపై ఆందోళన, జైల్లో భద్రతపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబుకు ఏమైనా అయితే ఊరుకోబోమని టిడిపి నాయకులు, కార్యకర్తలు వైసిపి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబుపై వైసిపి ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.