అమరావతి : మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత చంద్రబాబు అరెస్ట్ పై అసెంబ్లీ వేదికగా పోరాటానికి సిద్దమయ్యింది టిడిపి. ఇందుకోసం రేపటినుండి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని టీడీపి నిర్ణయించింది. ఈ మేరకు టిడిపి కేంద్ర కార్యాలయంలో అచ్చెన్నాయుడు అద్యక్షతన సమావేశమైన ఆ పార్టీ శాసనసభాపక్షం నిర్ణయం తీసుకుంది. టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చంద్రబాబు అరెస్ట్, ఆ తర్వాతి పరిణామాలపై కూడా ఈ సమావేశంలో చర్చించారు.