సీఎం దంపతుల సంక్రాంతి సంబరాలు... సాంప్రదాయ పంచెకట్టులో ఆకట్టుకున్న వైఎస్ జగన్ (ఫోటోలు)
First Published Jan 14, 2022, 4:15 PM ISTతాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలోని గోశాల వద్ద సంక్రాంతి సంబరాలు వైభవంగా జరిగాయి. ఈ సంబరాల్లో సీఎం వైఎస్ జగన్, సతీమణి భారతి పాల్గొన్నారు. సాంప్రదాయ పంచెకట్టులో సీఎం ఈ సంబరాల్లో పాల్గొన్నారు. సీఎం దంపతులకు అర్చకులు పూర్ణకుంభతో స్వాగతం పలికారు.
సీఎం దంపతులు గోవులకు ప్రత్యేక పూజలు చేసారు. భోగిమంటలు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, కోలాటాలు, పిండివంటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారుల సంక్రాంతి నృత్యాలు, డప్పు కళాకారుల విన్యాసాలతో వైభవంగా సంక్రాంతి వేడుకలు జరిగాయి. ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అధ్వర్యంలో ఈ సంక్రాంతి సంబరాలు జరగ్గా దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.