అనంతరం మహామండపం 7వ అంతస్తులోని పెద్ద రాజ గోపురం ఎదురుగా ఏర్పాటు చేసిన బొమ్మ కొలువును ఆలయ ఈవో, పాలకమండలి చైర్మన్ పైలా సోమినాయుడు దంపతులు ప్రారంభించారు. భోగి సందర్భముగా అమ్మవారి దర్శనార్థము విచ్చేసిన భక్తులు దేవస్థానం వారు ఏర్పాటుచేసిన భోగి మంటలు, బొమ్మకొలువు, ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు చూసి ఆనందించారు.